వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాటలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అడుగులు వేస్తున్నారు. డ్రాగన్ దేశం చైనాకు చెందిన 28 కంపెనీలను బైడెన్ బ్లాక్లిస్టులో చేరారు. ఆ కంపెనీల్లో అమెరికన్లు ఎవరూ పెట్టుబడుటు పెట్టరాదు అని పేర్కొన్నారు. గతంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ సుమారు 31 చైనా కంపెనీలను బ్లాక్లిస్టులో పెట్టారు. వాటిల్లో వాటాలు కొనుగోలు చేయవద్దు అన్నారు. ఇప్పుడు బైడెన్ తీసుకున్న నిర్ణయంతో బ్లాక్లిస్టులో చేరిన చైనా కంపెనీల సంఖ్య 59కి చేరుకున్నది. నిఘా టెక్నాలజీకి చెందిన చైనా కంపెనీలను బైడెన్ నిషేధించారు. దీనిపై వైట్హౌజ్ ప్రకటన కూడా చేసింది. ట్రంప్ పాలన సమయంలో ఎక్కువ శాతం టెలికాం, నిర్మాణ, టెక్నాలజీ సంస్థలపై ఆంక్షలు విధించారు. చైనా మొబైల్, చైనా టెలికాం, వీడియో సర్వియలెన్స్, చైనా రైల్వే కార్పరేషన్ సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే తమ కంపెనీలను బ్లాక్లిస్టులో పెట్టినట్లు చైనా ఆరోపించింది. మన పరిశ్రమలపై దాడి చేస్తున్న చైనాను అడ్డుకోవాలని ఇటీవల కొందరు రిపబ్లికన్, డెమోక్రటిక్ సేనేటర్లు అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.