బీఎస్ఈ వేదికలపై నిధుల సమీకరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లోని వివిధ వేదికల ద్వారా గత ఆర్థిక సంవత్సరం (2020-21) భారతీయ కార్పొరేట్లు రూ.18,56,366 కోట్ల నిధులను సమీకరించారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 53 శాతం అధికం కావడం గమనార్హం.