చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో వరుస విజయాలతో జోరుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి మరో శుభవార్త. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ డేనియల్ సామ్స్ చెన్నైలోని జట్టు బయో బబుల్లో చేరాడు. కొవిడ్-19 నేపథ్యంలో రెండుసార్లు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లోనూ నెగెటివ్ రావడంతో అతను జట్టుతో చేరినట్లు ఫ్రాంచైజీ శనివారం తెలిపింది. ఏప్రిల్ 7న సామ్స్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, అప్పటి నుంచి ఐసోలేషన్లో ఉన్నాడు.
ట్రేడింగ్ ద్వారా సామ్స్ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బెంగళూరు తీసుకుంది. ఆస్ట్రేలియా నుంచి ఏప్రిల్ 3న భారత్కు వచ్చినప్పుడు నిర్వహించిన టెస్టులో మొదట అతనికి నెగెటివ్ వచ్చింది. ఏప్రిల్ 7న ఆల్రౌండర్కు పాజిటివ్గా తేలింది. బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం 10 రోజుల తప్పనిసరి ఐసోలేషన్ తర్వాత సామ్స్ జట్టులో చేరినట్లు ఫ్రాంఛైజీ పేర్కొంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు ఏప్రిల్ 18న కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.