అమరావతి,జూలై:తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికారులు ఆక్రమణల తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పట్టణంలోని చింతచెట్టు సెంటర్ వద్ద మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తుండగా,టీడీపీ నేత కొల్లు రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితులకు మద్దతుగా పార్టీ కార్యకర్తలతో కలిసి అదే ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించారు. ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు,కొల్లు రవీంద్రకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆయనను పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.