చేర్యాల : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని స్థానిక చుంచనకోట క్రాస్ రోడ్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 26 టన్నుల ఐకేపీ సన్న వడ్లను స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు పట్టుకుని చేర్యాల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్ కి అప్పగించారు.
ఈ వడ్లను ముస్త్యాల గ్రామ సమీపంలోని శ్రీ రామ లింగేశ్వర రైస్ మిల్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కాగా, బిల్లు మాత్రం జమ్మికుంటలోని దేవి ట్రేడింగ్ కంపెనీ నుంచి తరలిస్తున్నట్లు.. దొంగ బిల్లు ను డ్రైవర్ కి ఇచ్చినట్లు ఆర్ఐ రవీందర్ తెలిపారు. లారీని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.