కోయిలకొండ, ఏప్రిల్ 10 : జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ రామకొండ దశాబ్దాల రోడ్డు కల సాకారం కానుంది. నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రత్యేక కృషితో కొండపై వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే గర్భాలయం వరకు పనులు పూర్తి కాగా కల్వర్లట్ల పనులు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణం పనుల ను మెఘా సంస్థ దక్కించుకొని విస్తృతంగా పనులు చేపడుతున్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న బండరాళ్లను బ్లాస్టింగ్ చేసి అడ్డు తొలగించారు. కొండకు రోడ్డుతోపాటు కింది నుంచిపై వరకు విద్యుత్ దీపాలు, మిషన్ భగీరథ పథకం ద్వారా తా గునీటి పైప్లైన్ వేశారు. భక్తులకు ఎ లాంటి అసౌకర్యం కలుగకుండా పను లు నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు..
కొండపై ఆదివారం అమావాస్యకు ప్రత్యేకత ఉంది. స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని వేల సంఖ్యలో భక్తులు కొండకు తరలివస్తారు. కొండపై ఉన్న మహిమాన్వితమై న వనమూళికలు, పుష్కరిణి నీరు ను భక్తులు వెంట తీసుకెళ్లారు. ఈసారి ఉగాది పండుగకు ముందు ఆదివారం అమావాస్య రావడంతో భక్తుల సంఖ్య పెరుగుతున్నదని అర్చకులు భావిస్తున్నారు.
పర్యాటకంగా అభివృద్ధి చేస్తా…
ప్రసిద్ధి పుణ్యకేత్రం శ్రీరామకొండను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. ఇప్పటికే కొండపై వరకు రోడ్డు, విద్యుత్ దీపాలు, తాగునీటి పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయి. నూతనంగా గర్భాలయం, మండప నిర్మాణం కోసం రూ.కోటి మంజూయ్యాయి. త్వరలోనే పనులను ప్రారంభిస్తాం.