న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెటర్ పియూష్ చావ్లా తండ్రి కరోనాతో బాధపడుతూ సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా చావ్లానే వెల్లడించాడు. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని చెబుతున్నాను. నా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా మే 10వ తేదీన మృతి చెందారు. ఆయన కొవిడ్తో బాధపడుతున్నారు అని చావ్లా ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఇది చూసి చావ్లా తండ్రికి ట్విటర్లో నివాళులర్పించాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. మొన్న అర్ధంతరంగా ముగిసిన ఐపీఎల్లో పియూష్ చావ్లా ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.