విద్య, వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
హన్మకొండ, జూన్ 3: నిరుపేదలను సీఎం సహాయనిధి ఆపద్బంధులా ఆదుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 9 మందికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.6.21లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సంద ర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నార న్నారు. పేదలకు అన్ని రకాలుగా అండగా ఉండాలన్న సంక ల్పంతో అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు సిబ్బందిని నియమిస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మా రితో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను వివిధ రకాల పథకాల ద్వారా ఆదుకుంటోందన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన వారి బిల్స్ను నియో జకవర్గం కార్పొరేటర్లు, స్థానిక నాయకులు తన దృష్టికి తీసుకురాగానే వారికి సాధ్యమైనంత త్వరగా సీఎం సహా య నిధి నుంచి నిధులు మంజూరు చేయిస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు మాడిశెట్టి శివశంకర్, పులి రజినీకాంత్, కోన శ్రీకర్, సుగుణాకర్రెడ్డి, సుంచు కృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.