హైదరాబాద్ : సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది.
కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో ఆయన ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు.
రేపు సాయంత్రం వర్చువల్గా జస్టిస్ బోబ్డే వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇవాళ జస్టిస్ బోబ్డేతో జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనంలో కూర్చోనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి