న్యూఢిల్లీ: భారత బృందంలో ఓ కరోనా పాజిటివ్ నమోదు కావడంతో బోక్సామ్ ఇంటర్నేషనల్ టోర్నీ ఫైనల్స్కు ముగ్గురు బాక్సర్లు దూరమై, రజతాలతో సరిపెట్టుకున్నారు. అశీష్ కుమార్ (75 కేజీలు)కు కరోనా వైరస్ సోకినట్టుగా తేలడంతో అతడితో పాటు రూమ్మెట్స్గా ఉన్న తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు), సుమిత్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే తర్వాత నిర్వహించిన పరీక్షల్లో హుసామ్, సంగ్వాన్కు నెగెటివ్ వచ్చింది.