హైదరాబాద్, ఆట ప్రతినిధి: బర్మింగ్హామ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్ సన్నాహకాలు మొదలయ్యాయి. గేమ్స్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది సమయమున్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ర్టాల నుంచి కామన్వెల్త్లో పాల్గొనే ప్లేయర్లతో నగరంలో మంగళవారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం బర్మింగ్హామ్ నగరం సర్వహంగులతో సిద్ధమవుతుందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ అండ్రూ ఫ్లెమింగ్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు సీనియర్ అథ్లెట్ జేజే శోభ, షట్లర్లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్, కశ్యప్, సాయి ప్రణీత్, గురుసాయి దత్, రిత్వికా శివానీ, షూటర్ ఇషాసింగ్, జిమ్నాస్ట్ మేఘన, విష్ణువర్ధన్రెడ్డి, స్విమ్మర్లు రిత్విక్రెడ్డి, సాయినిహార్, కోచ్లు రవి, ఇస్మాయిల్ బేగ్, అనూప్కుమార్ను ఫ్లెమింగ్ ఘనంగా సన్మానించారు.