అమరావతి: అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో విచారణతో పాటు తదుపరి చర్యలపై ఏపీ హైకోర్టు తాత్కాలికంగా ‘స్టే’ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుపై సోషల్మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో వ్యాఖ్యానించారు.
‘CBN పేరును ఎప్పుడో స్టేBNగా మార్చారు నెటిజెన్లు. ఏ తప్పూ చేయకపోతే కేసులు ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. ఇలా ఎంతకాలం స్టేలతో కాలం వెళ్లదీస్తాడో. ప్రజలు మాత్రం ఈయన చేసిన అక్రమాలకు స్టేలు ఇవ్వకుండా చిత్తుగా ఓడించి తీర్పు చెప్పారు. శిక్ష అమలు చేశార’ని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.