న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో పాల్గొనేందుకు
వెళ్లే భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ పుజారా తన భార్య పూజతో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నారు. ఇప్పటికే రహానే దంపతులు కూడా టీకా తీసుకున్న విషయం తెలిసిందే. ‘పూజ, నేను ఇవాళ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరుతున్నట్లు’ పుజారా ట్వీట్ చేశాడు.