న్యూఢిల్లీ: భారత గ్రాండ్మాస్టర్ ఎస్ఎల్ నారాయణన్ చెస్మూడ్ ఓపెన్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచాడు. అర్మెనియా వేదికగా జరిగిన ఈ టోర్నీలో నారాయణన్ 7 పాయింట్లు సాధించగా.. రష్యా గ్రాండ్మాస్టర్ అలెక్సీ గొగానోవ్ 7.5 పాయింట్లతో టైటిల్ చేజిక్కించుకున్నాడు. సోమవారం అలెక్సీతో జరిగిన తొమ్మిదో రౌండ్ను నారాయణన్ ‘డ్రా’గా ముగించాడు. మొత్తంగా ఈ టోర్నీలో ఆరు గేమ్లు నెగ్గిన నారాయణన్.. ఓ గేమ్లో ఓడి, మరో రెండు గేమ్లను డ్రాగా ముగించాడు. భారత్కే చెందిన ప్రజ్ఞానంద ఆరో స్థానం దక్కించుకోగా.. తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరగేసి అర్జున్ 18వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.