హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆన్లైన్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్లు మాస్టర్ కవిశ్ఆర్యన్ లంక, అరోహి మాథూర్ విజేతలుగా నిలిచారు. బాలుర అండర్-8 విభాగంలో మొత్తం ఏడు రౌండ్లకు గాను ఆరు పాయింట్లు సొంతం చేసుకున్న కవిశ్ టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో రజత పతక విజేత ఆర్కారామ్, హవిశ్, అడ్రియల్పై అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడు. రానున్న జాతీయ ఆన్లైన్ చాంపియన్షిప్లో రాష్ట్రం తరఫున కవిశ్, అర్కారామ్ బరిలోకి దిగనున్నారు. బాలికల కేటగిరీలో అరోహి మాథూర్ పసిడి పతకం కైవసం చేసుకోగా, సంహిత పుంగవనమ్ రజతం దక్కించుకుంది. వీరిద్దరు జాతీయ టోర్నీలో పోటీపడనున్నారు. విజేతలను రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ అభినందించారు.