ముంబై: ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న తన రెండో మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ. ఈ మ్యాచ్కు తొలి మ్యాచ్ ఆడిన టీమ్తోనే చెన్నై బరిలోకి దిగుతోంది. అటు పంజాబ్ కింగ్స్ టీమ్ కూడా విన్నింగ్ కాంబినేషన్ను ఈ మ్యాచ్కు కొనసాగిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరఫున ధోనీకిది 200వ మ్యాచ్ కావడం విశేషం. ఒక్క మ్యాచ్లో తప్ప మిగతా అన్ని మ్యాచ్లలోనూ ధోనీయే కెప్టెన్గా ఉన్నాడు. ఆ ఒక్క మ్యాచ్లో రైనా కెప్టెన్సీ వహించాడు.