న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో మరో మ్యాచ్ వాయిదా పడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్లో బాలాజీకి కొవిడ్ పాజిటివ్గా తేలడంతో టీమంతా ఐసోలేషన్లో ఉంది. దీంతో బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరగాల్సిన మ్యాచ్ను మరో తేదీకి రీషెడ్యూల్ చేయనున్నారు. ఇప్పటికే సోమవారం జరగాల్సిన కోల్కతా, బెంగళూరు మ్యాచ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. కోల్కతా టీమ్లో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కొవిడ్ బారిన పడటంతో మ్యాచ్ను వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు కరోనా నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లను ఈ నెల 7 నుంచి ముంబైలోనే నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది.