ముంబై: ‘మహీభాయ్ నాకు గురువుతో సమానం’ అని గతంలో చెప్పిన రిషబ్ పంత్ ఇప్పుడు ప్రత్యర్థి సారథిగా అతడినే ఢీకొననున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్తో రిషబ్ తలపడనున్నాడు. ముంబై వాంఖడే మైదానం వేదికగా ఈ సీజన్ రెండో మ్యాచ్లో గురు, శిష్యుల పోరు శనివారం జరుగనుంది. యువరక్తంతో ఢిల్లీ ఉరకలేస్తుంటే.. సీనియర్ సైన్యంతో డాడీస్ ఆర్మీ సమరానికి సిద్ధమైంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లేఆఫ్స్కు చేరుకోలేని పరాభవాన్ని గతేడాది యూఏఈలో చవిచూసిన ధోనీసేన మళ్లీ పుంజుకోవాలని కసిగా ఉంటే.. గత సీజన్లో ఫైనల్ చేరిన క్యాపిటల్స్ మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా పాక్తో సిరీస్ నుంచి వచ్చి క్వారంటైన్లో ఉన్న దక్షిణాఫ్రికా స్టార్ పేసర్లు కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్జే ఈ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు ఉండడం ఢిల్లీకి లోటే. శ్రేయస్ అయ్యర్ శస్త్రచికిత్స కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరం కాగా పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ను ముందుకు నడిపించనున్నాడు.
తుది జట్లు (అంచనా) :
చెన్నై: ఊతప్ప/ రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, ధోనీ (కెప్టెన్), బ్రావో, జడేజా, మొయిన్ అలీ, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్
ఢిల్లీ: ధవన్, పృథ్వీ షా, స్టీవ్ స్మిత్, పంత్ (కెప్టెన్), స్టొయినిస్, హిట్మైర్, క్రిస్ వోక్స్ / టామ్ కరన్, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ