కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బుట్టబొమ్మ పూజా హెగ్డే కరోనా నుండి కోలుకోగా, ఇప్పుడు మరో హీరోయిన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.‘యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా తనకు కరోనా సోకిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
కరోనా బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. నేను క్షేమంగానే ఉన్నాను. మీరంతా కూడా ఇంటిపట్టునే ఉండి క్షేమంగా ఉండండి అంటూ ఆండ్రియా పేర్కొంది.