చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. శనివారం నిర్వహించిన పరీక్షల్లో ఆస్ట్రేలియా క్రికెటర్కు కరోనా నెగెటివ్గా తేలిన విషయం తెలిసిందే. వైరస్ నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ పాజిటివ్ రావడంతో మరికొన్ని రోజులు హస్సీ భారత్లోనే ఉండాల్సి ఉంటుంది.
ఆసీస్ క్రికెటర్ చెన్నైలోని ఓ హోటల్లో ఐసోలేషన్లోనే కోలుకుంటున్నాడు. హస్సీతో పాటు చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్కు మే 3న కరోనా సోకింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2021 సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. ఐపీఎల్ 14వ సీజన్లో పాల్గొన్న ఆటగాళ్లలో కరోనా బారిన పడిన ఏడో వ్యక్తి హస్సీ.