చెన్నై: తమిళనాడులో ఘన విజయం సాధించి కొలువుదీరిన డీఎంకే పార్టీ ప్రభుత్వంలో 34 మంత్రులున్నారు. వీరిలో ఐదుగురు తెలుగువారు ఉండటం గమనార్హం. గత ప్రభుత్వాల్లోనూ తెలుగువారికి క్యాబినెట్లో ప్రాతినిధ్యాన్ని కల్పించారు. కొత్త సీఎం స్టాలిన్ కూడా అదే బాటలో వెళ్లారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. అందుకే ఆయా ప్రాంతాల్లో అన్ని పార్టీలు తెలుగువారికి టికెట్లు ఇస్తుంటాయి. తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల ద్వారా గెలుపొందారు. ఇకపోతే స్టాలిన్ క్యాబినెట్లో స్థానం దక్కించుకున్న ఐదుగురి తెలుగువారి వివరాలు చూద్దాం..
కేకేఎస్ రామచంద్రన్ – అరుప్పుకొట్టై ఎమ్మెల్యే. కీలకమైన రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు.
ఏ వేలు – తిరువణ్ణామలై నియోజకవర్గం. పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
ఆర్ గాంధీ – రాణిపేట నియోజకవర్గం. టెక్స్ టైల్ శాఖ మంత్రి.
పీకే శేఖర్ బాబు – చెన్నై దురైముగం నియోజకవర్గం. దేవాదాయశాఖ మంత్రి.
కేఎన్ నెహ్రూ – తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గం. మున్సిపల్ శాఖ మంత్రి.