న్యూఢిల్లీ: అత్యంత క్లిష్ట సమయాల్లో క్రికెట్ బలంగా నిలువలేదని ఐపీఎల్ వాయిదా మరోసారి గుర్తు చేసిందని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ అన్నాడు. కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది భారత్ వేదికగా జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడడమో లేదా వేరే వేదికకు తరలిపోవడమో జరుగుతుందని ఓ కాలమ్లో ఆయన అభిప్రాయపడ్డాడు. దేశంలో వైరస్ కేసులు, మరణాలు పెరుగడం, టోర్నీలో పాల్గొన్న వారిలో కొందరికి పాజిటివ్గా తేలడం వల్ల ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడింది. దీనివల్ల ఈ ఏడాది చివర్లో భారత్లో జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా లేదా వేరే చోటికి తరలిపోవడమో జరుగుతుంది అని చాపెల్ పేర్కొన్నాడు. అలాగే గతంలో అనువుకాని సమయాల్లో క్రికెట్ టోర్నీలు వాయిదా పడిన సందర్భాలను ఆయన ఉటంకించాడు.