ఇందూరు: వహీద్ స్మారక జాతీయ ఫుట్బాల్ టోర్నీలో తమిళనాడు విజేతగా నిలిచింది. నిజామాబాద్లోని నాగారం స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో తమిళనాడు 3-0తో కేర్ ఫుట్బాల్ అకాడమీపై గెలిచి టైటిల్ చేజిక్కించుకుంది. తెలంగాణ, కేరళ మధ్య మూడో స్థానం కోసం జరుగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకావడంతో ఇరుజట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ధ్యాన్చంద్ అవార్డీ షబ్బీర్ అలీ, రాష్ట్ర ఫుట్బాల్ సంఘం కార్యదర్శి ఫాల్గుణ, అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు రత్నాకర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు షకీల్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.