పోర్టో (పోర్చుగల్): చెల్సీ ఫుట్బాల్ క్లబ్ తొమ్మిదేండ్ల తర్వాత యూరప్ చాంపియన్స్ లీగ్ టోర్నీ విజేతగా నిలిచింది. ఫైనల్లో చెల్సీ 1-0తో స్టార్ జట్టు మాంచెస్టర్ సిటీపై గెలిచింది. 42వ నిమిషంలో జర్మనీ ఫార్వర్డ్ ఆటగాడు కై హావెర్ట్జ్ గోల్బాది చెల్సీకి టైటిల్ అందించాడు. మ్యాచ్ రెండో అర్ధభాగం హోరాహోరీగా సాగినా మరో గోల్ నమోదు కాలేదు. చాంపియన్స్ లీగ్ విజేతగా నిలువడం చెల్సీకి ఇది రెండోసారి. కాగా పోర్చుగల్లో కరోనా ప్రభావం తగ్గడంతో దాదాపు 14 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ మ్యాచ్ జరిగింది.