న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా రికార్డు సృష్టించిన భవానీ దేవి.. ఫ్రాన్స్ వేదికగా జరిగిన టోర్నీలో విజేతగా నిలిచింది. మహిళల వ్యక్తిగత ‘సబ్రే’ ఈవెంట్లో బరిలోకి దిగిన 28 ఏండ్ల భవాని అద్వితీయ ప్రదర్శనతో ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘సీజన్కు మంచి ఆరంభం లభించింది. చార్లేవిల్లే టోర్నీలో విజేతగా నిలువడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం వెనుక కోచింగ్ స్టాఫ్ కృషి ఎంతో ఉంది’అని భవాని ట్వీట్ చేసింది. టోక్యో ఒలింపిక్స్ తొలి రౌండ్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన భవాని.. వచ్చే ఏడాది హాంగ్జూలో జరుగనున్న ఆసియా క్రీడలపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాకింగ్స్లో 50వ ర్యాంక్లో ఉన్న ఈ యువ ఫెన్సర్ అదే లక్ష్యంతో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నది.