అమలాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న సీఐ బాజీలాల్ సిబ్బందితో కలిసి రైడింగ్కు వెళ్లారు. అక్కడ ఒక యువతితో ఇద్దరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. నిర్వాహకులతోపాటు ఇద్దరు విఠులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువతిని మహిళా సంరక్షణ కేంద్రానికి పంపించారు.
ముమ్మిడివరానికి చెందిన ఓ మహిళకు ఇటీవల అమలాపురంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న కడియం రవి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ ఇద్దరూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం రావడంతో సీఐ బాజీలాల్, ఎస్సై సురేష్బాబు ఆ గృహంపై రైడ్ చేశారు.
అక్కడ వారికి యువతితోపాటు ఇద్దరు నిర్వాహకులు, విఠులుగా వచ్చిన ఇద్దరు ఆటో డ్రైవర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. దాంతో నిర్వాహకులైన మహిళను, రవిని, అమలాపురం రూరల్ మండలం నల్లమిల్లికి చెందిన ఆటో డ్రైవర్ గెడ్డం ప్రసాద్, అల్లవరం మండలం మొగళ్లమూరుకు చెందిన ఆటో డ్రైవర్ తాడి పౌలును అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు.
ఇవికూడా చదవండి..
పెండ్లిళ్లకు 100 మందికి, చావులకు 50 మందికే అనుమతి..!
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
బీజేపీ మహిళా నేత ముఖంపై హానికర రంగులు చల్లిన దుండగులు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నది: ప్రధాని
దేశంలోని సామాజిక కార్యకర్తల కృషి ఎనలేనిది: ప్రధాని మోదీ
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
మిథాలీ రాజ్, పీవీ సింధుపై ప్రధాని ప్రశంసలు
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!