దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మూడో ర్యాంక్కు పడిపోయింది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 29.00 సగటుతో 87 పరుగులు మాత్రమే చేసిన మిథాలీ నంబర్వన్ ర్యాంక్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ లిజెల్లీ లీ (761 పాయింట్లు), అలీసా హిలీ (750 పాయింట్లు) వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలకు ఎగబాకగా.. మిథాలీ 738 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. టాప్-10లో భారత్ నుంచి మిథాలీతో పాటు స్మృతి మందన (6వ ర్యాంక్) మాత్రమే ఉన్నారు. బౌలర్ల విభాగంలో రెండు ర్యాంక్లు మెరుగుపర్చుకున్న భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి రెండో ర్యాంక్కు దూసుకెళ్లింది.