మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు
చౌటుప్పల్ మార్చి31: మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని కౌన్సిలర్లు బహిష్కరించడం సమంజసం కాదని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021-22 సంవత్సానికి సంబంధించి బడ్జెట్ పై చర్చించేందుకు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశామని, చర్చించకుండానే కౌన్సిలర్లు వాకౌట్ చేయడం సరికాదన్నారు. పారిశుధ్య కార్మికుల నియామకంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అందరి సమక్షంలో ఇదే విషయాన్ని కార్మికులు తేటతెల్లం చేశారన్నారు. పారిశుధ్య కార్మికుల నియామకంలో అవకతవకలు జరిగాయని కౌన్సిలర్లు ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ జరపాలని కమిషనర్ను ఆదేశించామన్నారు. విచారణ జరిపి ఎలాంటి అవకతవకలు జరగలేదని తేల్చారని, ఈమేరకు పారిశుధ్య కార్మికుల నుంచి లెటర్లు సైతం తీసుకున్నారని తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్లు ఎండీ బాబాషరీఫ్, లింగస్వామి,రాజ్యలక్ష్మీస్వామిగౌడ్ ఉన్నారు.
దైవచింతనతో మానసిక ప్రశాంతత
దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. మున్సిపాలిటీ కేంద్రంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సుర్కంటి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయం ప్రహరీ నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్, దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పాశం సంజయ్బాబు, మాజీ అధ్యక్షుడు బడుగు మాణిక్యం పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులపై చర్చించారు. మున్సిపల్ కమిషనర్ రాందుర్గారెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలంగౌడ్ , కౌన్సిలర్లు పాల్గొన్నారు.