పనాజీ: కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరుగడంతో గోవా ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్ల ఎగుమతిపై నిషేధం విధించింది. పరిశ్రమల కోసం ఉద్దేశించిన అక్సిజన్ను కూడా వైద్య సేవలకు వినియోగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం గోవా పరిశ్రమల శాఖను ఆయనే పర్యవేక్షిస్తున్నారు.
‘గోవాలో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం అధికమైంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్ల ఎగుమతిని తక్షణమే నిషేధించాం’ అని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల కోసం ఉద్ధేశించిన అక్సిజన్ను కూడా గోవా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సహా ఇతర కొవిడ్-19 ఆస్పత్రులకు మళ్లిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజా ప్రయోజనార్థం, ప్రజా సంరక్షణ కోసం విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద కలెక్టర్లందరికీ దీనిపై మార్గదర్శకాలు ఇవ్వాలని గోవా ఆరోగ్యశాఖ కార్యదర్శికి సూచించామని మంత్రి వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో
కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు
నటుడు సోనూసూద్కు కరోనా పాజిటివ్
వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసా..?
కోవిడ్పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!