హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఈసారి డాక్టర్ బాబూ జగ్జీవన్రాం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత ప్రభుత్వం జారీచేసిన నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా గురువారం ఆదేశాలు జారీచేశారు. ఈనెల 5న డాక్టర్ బాబూ జగ్జీన్రాం, 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఆ మహనీయుల విగ్రహాలకు పూలమాలు వేసి వారి స్ఫూర్తిని చాటాలని పేర్కొన్నారు.
మహనీయుల జయంతిని నిర్వహించాలి: వంగపల్లి శ్రీనివాస్
ఉస్మానియా యూనివర్సిటీ ఈ నెలలో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని దళిత అభ్యుదయ సేన నాయకులు విజ్ఞప్తిచేశారు. బాబూ జగ్జీవన్రాం, పూలే, అంబేద్కర్ ఆశయాలను తాము కొనసాగిస్తామని స్పష్టంచేశారు. గురువారం ఉస్మానియా వర్సిటీ గెస్ట్హౌజ్లో దళిత అభ్యదయ సేన నాయకులు వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య, మాల చెన్నయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అస్పృశ్యతను రూపుమాపేందుకు కృషిచేసిన మహనీయుల జయంతి ఉన్న ఈ నెలను పవిత్రమాసంగా నిర్వహించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాగారం చినబాబు, జంగ శ్రీను, శ్యామ్రావు, పొట్టపైన రమేశ్ పాల్గొన్నారు.