నిజామాబాద్ : శానిటేషన్ వ్యవస్థ మరింత మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
నిజామాబాద్ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన 70 వాహనాలను కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.6.50 కోట్లతో వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఈ వాహనాల నిర్వహణకు 70 మంది డ్రైవర్లు, 300 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ఖాన్, అదనపు కల్టెర్ బీఎస్ లత, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ : మంత్రి సత్యవతి రాథోడ్
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్