సూర్యకుమార్, కృనాల్కు చోటు
సిరాజ్ పునరాగమనం
ఇంగ్లండ్తో వన్డేలకు భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: భారత వన్డే జట్టుకు కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా తొలిసారి ఎంపికయ్యారు. ఇంగ్లండ్తో మూ డు వన్డేల సిరీస్ కోసం 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును సెలెక్టర్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 23న సిరీస్ ప్రారంభం కానుండగా.. మూడు వన్డేలు పుణె వేదికగా ప్రేక్షకులు లేకుండా జరుగనున్నాయి. 2019 జనవరిలో ఆసీస్తో ఏకైక వన్డే ఆడిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ఈ సిరీస్లో అవకాశం దక్కింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో రాణించడంతో అతడు మళ్లీ వన్డేల్లో పునరాగమనం చేశాడు. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో 14 వికెట్లతో సత్తాచాటడంతో ప్రసిద్ధ్కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది.
భారత జట్టు: కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, ధవన్, శుభ్మన్ గిల్, శ్రేయస్, సూర్యకుమార్, హార్దిక్, పంత్, కేఎల్ రాహుల్, చాహల్, కుల్దీప్, కృనాల్, సుందర్, నటరాజన్, భువనేశ్వర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్