దుబాయ్: ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆ క్రేజీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక టీ20 వరల్డ్కప్లో భాగంగా ఆదివారం జరిగే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. అయితే యూఏఈకి చెందిన వ్యాపారవేత్త అనిస్ సాజన్ ఆ మ్యాచ్ను చూసేందుకు వంద మందికి ఉచితంగా టికెట్లను గిఫ్ట్గా ఇచ్చేశారు. దనుబే కంపెనీలో పనిచేస్తున్న బ్లూ కాలర్ వర్కర్లకు వంద టికెట్లను ఫ్రీగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇండోపాక్ సమరాన్ని ఉద్యోగులు ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా వర్సెస్ ఏ2 క్వాలిఫయర్ మ్యాచ్లకు కూడా వందేసి టికెట్లను అనిస్ ఫ్రీగా ఇస్తున్నారు.