టోక్యో : పోలండ్కు చెందిన ఆరుగురు స్విమ్మర్ల ఒలింపిక్ ఆశలు ఆ దేశ బోర్డు నిర్వాకంతో అడియాసలయ్యాయి. ఇటీవలే 23 మందితో కూడిన పోలండ్ ఒలింపిక్ బృందంలో టోక్యోకు బయల్దేరిన ఆటగాళ్ల రిజిస్ట్రేషన్లో తప్పులు దొర్లాయి. దీంతో నిర్వాహకులు చేసిన తప్పునకు స్విమ్మర్లు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బరిలోకి దిగే అవకాశం లేకపోవడంతో టోక్యో నుంచి స్వదేశానికి తిరిగి పంపినట్లు ఒలింపిక్ నిర్వాహకులు బుధవారం పేర్కొన్నారు. అనుమతి పొందిన అథ్లెట్ల కంటే ఎక్కువ మందిని తీసుకొచ్చినందుకు గాను పోలండ్ స్విమ్మింగ్ ఫెడరేషన్ బోర్డు ఒలింపిక్ నిబంధనలను అతిక్రమించిందని ఆరోపిస్తూ స్విమ్మర్లను తిప్పి పంపారు. దీనిపై పోలండ్కు చెందిన టాప్ స్విమ్మర్ కసియా వాసిక్ స్పందిస్తూ.. బోర్డు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.