టోక్యో: 2032 ఒలింపిక్స్ క్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్ జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ 32 ఏళ్ల విరామం తర్వాత.. ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. 1956లో ఒలింపిక్స్కు మెల్బోర్న్ ఆతిథ్యం ఇచ్చింది. ఆస్ట్రేలియాలో క్రీడలు విజయవంతంగా నిర్వహించేందుకు ఏం చేయాలో తమకు తెలుసు అని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. ఆతిథ్య నగరం కోసం జరిగిన ఓటింగ్లో బ్రిస్బేన్కు 72-5 తేడాతో ఓట్లు పోలయ్యాయి. టోక్యో తర్వాత.. 2024లో పారిస్లో.. 2028లో లాస్ ఏంజిల్స్లో ఒలింపిక్స్ జరగనున్నాయి.