హైదరాబాద్, ఆట ప్రతినిధి: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నీలో గోపాలకృష్ణ, సురేశ్ దువ్వాల విజేతలుగా నిలిచారు. కరోనా వైరస్ జాగ్రత్తల నేపథ్యంలో ఆన్లైన్లో జరిగిన టోర్నీ జూనియర్ కేటగిరీలో గోపాలకృష్ణ, యథార్థ్ పటేల్ తొలుత 11 పాయింట్లతో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు జరిగిన టైబ్రేక్ పోరులో గోపాలకృష్ణ టైటిల్ దక్కించుకున్నాడు. యథార్థ్ పటేల్, అజ్జేష్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఓపెన్ విభాగంలో సురేశ్ దువ్వాల విజేతగా నిలువగా, అభిషేక్ రన్నరప్ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు.