దుబాయ్: టీ20 వరల్డ్కప్ను ఇండియానే ఎగురుచేసుకుపోతుందని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ జోస్యం చెప్పాడు. ఇక ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసేది, అత్యధిక వికెట్లు తీసేది కూడా ఇండియన్లే అని చెప్పాడు. ఇప్పటికే రెండు వార్మప్ మ్యాచుల్లో ఇండియన్లు సత్తా చాటారు. ఆ రెండు మ్యాచ్లను ఈజీగా గెలిచిన విషయం తెలిసిందే. ఇండియా తన తొలి మ్యాచ్ను ఆదివారం పాకిస్థాన్తో ఆడనున్నది. ఐసీసీకి రాసిన ఓ కథనంలో.. బ్రెట్ లీ మరికొన్ని అంచనా వేశారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసేది ఇండియన్ బ్యాటర్ అని చెప్పాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ .. వరల్డ్కప్లో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్గా నిలుస్తాడని అంచనా వేశాడు. ఇక బౌలర్ మహ్మద్ షమి అత్యధిక వికెట్లు తీసుకుంటాడని బ్రెట్ లీ చెప్పాడు. ఈ ఇద్దరూ నిజానికి ఐపీఎల్లో పంజాబ్ తరపున ప్రాతినిధ్యం వహించారు. గత కొన్ని నెలల నుంచి వాళ్లు ఆడుతున్న తీరును బట్టి ఈ అంచనా వేయడం జరిగినట్లు లీ అన్నాడు. ఒకవేళ వాళ్లు రాణిస్తే, 4ఇండియా కచ్చితంగా కప్ గెలుస్తుందని బ్రెట్ చెప్పాడు.