న్యూఢిల్లీ: ప్రమాదకర కరోనా వైరస్తో పోరాడుతున్న భారత్కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ బాసటగా నిలిచాడు. తన దేశానికే చెందిన ప్యాట్ కమిన్స్ను ఆదర్శంగా తీసుకుంటూ కరోనాపై పోరులో భారత్కు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. తాను బిట్కాయిన్(విలువ రూ.40లక్షలు)ను విరాళమిస్తున్నట్లు బ్రెట్లీ మంగళవారం తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. భారత్ తనకు రెండో ఇల్లు లాంటిదని, ఇక్కడి ప్రజలు చూపించే ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని లీ పేర్కొన్నాడు.