న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై విధించిన నిషేధాన్ని నెదర్లాండ్స్ ప్రభుత్వం ఎత్తివేసింది. అలాగే, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, దక్షిణాఫ్రికా విమానాలపై కూడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ‘జూన్ 1 నుంచి ఇండియా, దక్షిణాఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం’ అని నెదర్లాండ్స్ ప్రభుత్వం తెలిపింది.
దాంతో ఆయా దేశాల నుంచి ప్రయాణికులు నెదర్లాండ్స్లో అడుగుపెట్టే వెసులుబాటు లభించింది. అయితే, ప్రయాణానికి ముందు చేయించుకున్న కొవిడ్-19 నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అని నెదర్లాండ్స్ సర్కారు షరతు విధించింది. అలాగే, క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. భారత్ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్ విమానాలపై నెదర్లాండ్స్ గత నెలలోనే నిషేధం విధించింది.