టోక్యో: ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల విజయాలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచుల్లో స్టార్ షెట్లర్ పీవీ సింధు, అతాను దాసు తమతమ విభాగాల్లో విజయాలు సాధించి ప్రీక్వార్టర్లోకి ప్రవేశించగా, భారత హాకీ జట్టు డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను మట్టికరిపిందిచింది. ఇప్పుడు బాక్సింగ్లో సతీశ్ కుమార్ తన పదునైన పంచ్లతో విజయం సాధించాడు. బాక్సింగ్ 91 కిలోల విభాగంలో జమైకా బాక్సర్ బ్రౌన్ రికార్డోపై సతీశ్ కుమార్ పంచ్ల వర్షం కురిపించాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో 1-4 తేడాతో గెలుపొంది క్వార్టర్ఫైనల్స్కు చేరాడు. ఇప్పటికే మేరీకోమ్, పూజారాణి తమతమ విభాగాల్లో క్వార్టర్స్లోకి ప్రవేశించారు.