హైదరాబాద్: కరోనాను నియంత్రించడానికి దేశమంతా వ్యాక్సినేషన్పై కేంద్రం చెప్పిన అబద్ధాలు బట్టబయలు అయ్యాయని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. వచ్చే డిసెంబర్ నాటికి 213 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం చెప్పిందని ఆదివారం గుర్తు చేశారు.
తాజాగా సుప్రీంకోర్టులో అందుకు భిన్నంగా ఆగస్టు నుంచి డిసెంబర్ నాటికి 135 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే లభ్యం అవుతాయని అఫిడవిట్ వేసిందని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
మే నెలలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ డిసెంబర్ నాటికి 213 కోట్ల వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంటాయని చెప్పారని ఒవైసీ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 213 కోట్ల నుంచి 135 కోట్ల వ్యాక్సిన్లకు పడిపోయిందన్నారు.
దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ అబద్దాలు బట్టబయలయ్యాయని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆగస్టు-డిసెంబర్ మధ్య భారత్ బయోటెక్ 7.60 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నదన్న ప్రచారం మరో అబద్ధం అన్నారు.
జూన్లో ఈ సంస్థ 50 లక్షల డోస్లు ఎలా అందిస్తుందని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. అతి శయోక్తితో కూడిన నంబర్లు చెప్పడం కామిక్స్ బుక్స్లో మాత్రమే ఉంటాయని ఎద్దేవా చేశారు.