న్యూఢిల్లీ: నిషేధానికి గురైన జింబాబ్వే మాజీ కెప్టెన్ హిత్ స్ట్రీక్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. క్రికెట్లో అవినీతి చేసేందుకు బుకీలు క్రిప్టో కరెన్సీని ఎరవేస్తున్నట్టు వెల్లడైంది. దీంతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి కొత్త సవాల్ ఎదురైంది. బింబాబ్వే, బంగ్లాదేశ్తో పాటు ఐపీఎల్, బీపీఎల్లో కోచింగ్ సిబ్బందిలో పని చేసిన సమయంలో స్ట్రీక్ జట్ల అంతర్గత విషయాలను బుకీలకు అందించినట్టు తేలడంతో అతడిపై ఐసీసీ ఎనిమిదేండ్ల నిషేధం విధించింది. అయితే అవినీతి చేసినందుకు బుకీలు బిట్కాయిన్లు ఇచ్చినట్టు అతడు ఐసీసీకి చెప్పడంతో షాక్ ఎదురైంది. ఇప్పటి వరకు డబ్బు, కార్లు, ఆభరణాలు, విలువైన ఫోన్లు ఇచ్చి అవినీతి చేసేందుకు ఎరవేసిన బుకీలు.. క్రిప్టో కరెన్సీని కూడా వినియోగిస్తున్నట్టు తెలియడంతో దీన్ని అడ్డుకునేందుకు కూడా ప్రణాళికలు ఉన్నాయని ఐసీసీ ఏసీయూ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపారు.