న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ బిషన్సింగ్ బేడీ శుక్రవారం దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యాడు. గత కొన్ని రోజులుగా సర్ గంగారామ్ దవాఖానలో చికిత్స తీసుకున్న బేడీ ఆరోగ్యం కుదుటపడటంతో డాక్టర్ల సూచన మేరకు ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో కోలుకునేందుకు మరింత విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.