ఉట్నూర్, ఏప్రిల్ 24: రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఓ వైపు టీకాకు, మరోవైపు నిర్ధారణ పరీక్షలకు ప్రజలు బారులు తీరుతున్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 45 సంవత్సరాలు దాటిన 24 మందికి టీకా వేశామని సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. అలాగే 100 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.
మండలంలో 56 మందికి పాజిటివ్
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 24: దంతన్పెల్లి పీహెచ్సీలో 100 మందికి పరీక్షలు చేయగా 24 మందికి, శ్యాంపూర్ పీహెచ్సీలో 75 మందికి పరీక్షలు చేయగా 13 మందికి, హస్నాపూర్ పీహెచ్సీలో 80 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యురాలు అనురాధ, హెచ్ఈ సత్యనారాయణ తెలిపారు.
ఇచ్చోడలో 31 మందికి..
ఇచ్చోడ, ఏప్రిల్ 24: మండల వ్యాప్తంగా శనివారం 31 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇచ్చోడ ప్రభుత్వ దవాఖానలో 68 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కైలాస్ తెలిపారు. 45ఏళ్లు దాటిన 24 మందికి టీకా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానలో 90 మందికి పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రాథోడ్ హిమబిందు తెలిపారు. 11 మందికి టీకా వేశామని ఆమె చెప్పారు.
నార్నూర్లో నలుగురికి..
నార్నూర్, ఏప్రిల్ 24: మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు హెచ్ఈవో చౌహాన్ నాందేవ్ తెలిపారు.
బోథ్లో 15 మందికి..
బోథ్, ఏప్రిల్ 24: మండల వ్యాప్తంగా 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు ఆర్ రవీంద్రప్రసాద్, కే నవీన్రెడ్డి తెలిపారు. బోథ్ సీహెచ్సీలో 35 మందికి పరీక్షలు చేయగా 8 మందికి, సొనాల పీహెచ్సీలో 75 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.
నేరడిగొండలో ఎనిమిది మందికి…
నేరడిగొండ, ఏప్రిల్ 24 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో 106 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు హెచ్ఈవో హరికుమార్గౌడ్ తెలిపారు. అలాగే 9 మంది వ్యాక్సిన్ వేసుకున్నట్లు పేర్కొన్నారు.
గుడిహత్నూర్లో ఐదుగురికి ..
గుడిహత్నూర్, ఏప్రిల్ 24: మండల కేంద్రంలోని పీహెచ్సీలో 55 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. 24 మందికి టీకా వేశామని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లిలో 13 మందికి..
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 24: మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్న వరకు ప్రజలు బారులు తీరి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకున్నారు. 37 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 13మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ శ్రీకాంత్, సీహెచ్వో రాథోడ్ బాబులాల్ తెలిపారు. సీహెచ్వో రాథోడ్ బాబులాల్, వైద్యసిబ్బంది శ్రీనివాస్, బాలరాం, తదితరులు పాల్గొన్నారు.
టీకాతోనే కరోనా నియంత్రణ
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 24: టీకాతోనే కరోనా నియంత్రించ వచ్చని డాక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో శనివారం 24మందికి కొవిడ్ టీకా వేశారు. ధనోరా(బీ), శంకర్గూడ, ఇంద్రవెల్లి నుంచి ప్రజలు తరలివచ్చి పీహెచ్సీలో పేర్లు నమోదు చేసుకొని టీకా వేయించుకున్నారు. వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
అపోహలు వద్దు
నార్నూర్, ఏప్రిల్ 24: కొవిడ్ టీకాపై అపోహలు పెట్టుకోవద్దని గాదిగూడ తహసీల్దార్ మోతీరాం అన్నారు. గాదిగూడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకా వేసుకున్నాడు. వైద్యసిబ్బంది ఉన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
సిరికొండ, ఏప్రిల్ 24: కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నర్సాపూర్ పీహెచ్సీ డాక్టర్ హిమబిందు పేర్కొన్నారు. నర్సాపూర్ పీహెచ్సీ, పిట్టబొంగురం, సిరికొండ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వైద్యసిబ్బంది 59 మందికి టీకా వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేశ్, ఆర్ఐ యుజ్వేందర్ రెడ్డి, సర్వేయర్ గణేశ్, అసిస్టెంట్ డాక్టర్ అశోక్ విజయ్కుమార్, సుశీల ఉన్నారు.
45మందికి టీకా
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 24: దంతన్పెల్లి పీహెచ్సీ, లక్కారం గ్రామ పంచాయతీలో 44 మందికి కొవిడ్ టీకా వేసినట్లు వైద్యురాలు అనురాధ తెలిపారు. ఆశకార్యకర్తలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
తాంసి, ఏప్రిల్ 24: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పొన్నారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో టీకా కేంద్రం ఏర్పాటు చేశారు. రెండు చోట్ల 200 మంది వరకు టీకా వేసినట్లు డాక్టర్లు తెలిపారు.