టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో ఘనతను దక్కించుకున్నాడు.
మార్చి నెలకుగాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లో అద్బుత ప్రదర్శన చేసినందుకు భువీకి అవార్డు దక్కింది. 31 ఏండ్ల పేసర్ మూడు వన్డేల్లో 4.65 ఎకానమీ రేటుతో ఆరు వికెట్లు పడగొట్టాడు.
ఐదు టీ20 ల్లో 6.38 ఎకానమీ రేటుతో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్తో ఐదో టీ20లో భువీ ఏకంగా 17 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఈ అవార్డు అందుకున్న మూడో భారత క్రికెటర్ భువీ
కావడం విశేషం. ఇప్పటి వరకు జనవరి నెలకు వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫిబ్రవరి నెలకు గానూ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవార్డులకు ఎంపికయ్యారు.