దుబాయ్: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్కు నామినేట్ అయిన క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం ప్రకటించింది. పురుషుల జాబితాలో టీమ్ఇండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు చోటు దక్కింది. భువీతో పాటు జింబాబ్వే క్రికెటర్ సీన్ విలియమ్స్, అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అవార్డు రేసులో ఉన్నారు.
ఇంగ్లాండ్తో మూడు వన్డేలు ఆడిన భువీ 4.65 ఎకానమీ రేట్తో 6 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐదు టీ20ల సిరీస్లో పాల్గొన్న పేసర్ 6.38 ఎకానమీ రేట్తో 4 వికెట్లు తీశాడు. వన్డే, టీ20ల్లో అద్భుత ప్రదర్శనతో బౌలర్లను కట్టడి చేసి భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
ఇక పురుషులతో పాటు మహిళా ప్లేయర్ల నామినీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. విమెన్స్ క్రికెటర్లలో ఇద్దరు భారత అమ్మాయిలకు చోటు దక్కింది. రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ రౌత్తో పాటు సౌతాఫ్రికా లిజెల్లీ లీ పోటీపడుతున్నారు.