టోక్యో: టోక్యో పారా ఒలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనా ప్యాడ్లర్ మియావో జాంగ్పై 3-2తో విజయం సాధించింది. వరల్డ్ నంబర్ త్రీ ప్లేయర్ అయిన జాంగ్ను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 స్కోర్తో మట్టికరిపించింది. దీంతో ఫైనల్కు చేరిన తొలి భారత టీటీ ప్లేయర్గా రికార్డు సృష్టించింది. కాగా, ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ వన్ సీడ్, చైనా ప్లేయర్ యింగ్ ఝోతో తలపడనుంది. ఆ మ్యాచ్లో భవీనా ఒకవేళ ఓడినా భారత్కు సిల్వర్ మెడల్ దక్కనుంది.