తొలి భారత ఫెన్సర్గా చరిత్ర
చెన్నై: ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా సీఏ భవానీదేవీ చరిత్ర సృష్టించింది. అడ్జెస్టెడ్ అఫీషియల్ ర్యాంకింగ్ (ఏఓఆర్) విధానం ద్వారా మహిళల వ్యక్తిగత సబ్రె విభాగంలో టోక్యో ఒలింపిక్స్కు భవాని క్వాలిఫై అయింది. అలాగే హంగేరీలో జరిగే ప్రపంచకప్లోనూ ఆమె చోటు దక్కించుకుంది. టీమ్ఈవెంట్లో దక్షిణ కొరియా చేతిలో భారత్ పరాజయం పాలైనా.. భవాని మంచి ప్రదర్శన చేసింది. ఒలింపిక్స్లో చోటు దక్కించుకొని చరిత్ర సృష్టించిన 27 ఏండ్ల భవానీని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ ద్వారా అభినందించారు.