బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్.. క్వార్టర్స్లోకి పీవీ సింధు ప్రవేశించింది. రెండవ రౌండ్ మ్యాచ్లో సింధు 21-8, 21-8 స్కోర్తో డెన్మార్ ప్లేయర్ లైన్ క్రిస్టోఫెర్సన్ను ఓడించింది. కేవలం 25 నిమిషాల్లోనే ఆమె మ్యాచ్ను ఫినిష్ చేసింది. సింధు దూకుడు ఆట ముందు క్రిస్టోఫెర్సన్ ఏమాత్రం నిలవలేకపోయింది. అయితే క్వార్టర్స్లో మాత్రం సింధు బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోనున్నది. ఇక ఇవాళ జరిగే మ్యాచ్ ఆమెకు పెద్ద పరీక్ష కానున్నది. జపాన్కు చెందిన ప్లేయర్ అకేన్ యమగుచితో సింధు తలపడనున్నది. సెకండ్ రౌండ్లో యమగుచి తన ప్రత్యర్థి నుంచి వాకోవర్ తీసుకున్నది. భారత్కు చెందిన డబుల్స్ జోడి.. సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు.. క్వార్టర్స్లోకి ప్రవేశించలేకపోయారు. డానిష్ జోడి కిమ్ అండర్స్ చేతిలో వాళ్లు ఓడిపోయారు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఆ మ్యాచ్లో 16-21, 21-11, 17-21 స్కోర్తో భారత డబుల్స్ జోడి ఓటమిపాలైంది.