న్యూఢిల్లీ: పొట్టి ప్రపంచకప్ అనంతరం టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రి గడువు ముగుస్తుండటంతో.. కొత్త కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో ఓ ఏడాది పాటు భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన అనిల్ కుంబ్లేతో పాటు, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్లలో ఒకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.